తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ జీవో.. పేద, మధ్యతరగతి ప్రజల దోపిడి కోసమే' - జీవో 131ని రద్దు చేయాలన్న ఎన్‌వీఎస్‌ ప్రభాకర్

ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో జీవో 131ని తీవ్రంగా తప్పు పడుతున్నామని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. ఆ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు.పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచేదిగా ఆ జీవో ఉందని ఆరోపించారు.

nvs prabhakar reddy comment on 131 go is only for the exploitation of poor, middle class people
'ఆ జీవో.. పేద, మధ్యతరగతి ప్రజల దోపిడి కోసమే'

By

Published : Sep 8, 2020, 5:32 PM IST

'ఆ జీవో.. పేద, మధ్యతరగతి ప్రజల దోపిడి కోసమే'

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సమగ్రంగా చర్చించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని భూముల స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇప్పటికే భూ యాజమనులు, ఇంటి యాజమానుల నుంచి తెరాసకు చెందిన వ్యక్తులు టాక్స్‌లు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం అనేది ముమ్మాటికి పేద, మధ్యతరగతి ప్రజలను దోపిడి చేయాడానికే అని ఆయన మండిపడ్డారు. భాజపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను వెంటనే రద్దు చేయాలని.. లేని పక్షంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చించారు.

ఇదీ చూడండి :'వాళ్లకే సాధ్యం కాలేదు.. మీతో ప్రాంతీయ పార్టీలు కూడా రావు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details