తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: ఆ రైతు కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత - చిత్తూరు రైతు కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత

ఏపీలోని చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్‌రాజ్‌పల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు కుమార్తెలు అతనికి అండగా నిలుస్తూ వారి పొలంలో దుక్కిదున్నారు. ఈ ఇద్దరికి ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయాన్ని అందిస్తామని తెలిపింది. గండిపేట మహిళ కళాశాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ అడ్మిషన్ ఇవ్వటంతో పాటు... ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించనుంది.

ntr-trust-helps-to-chittor-district-farmer-nageshwar-rao-family
ఏపీ: ఆ రైతు కుటుంబానికి ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత

By

Published : Jul 29, 2020, 11:00 PM IST

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం మహల్‌రాజ్‌పల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు.. మదనపల్లెలో ఓ టీ దుకాణం నడుపుతుండేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా సొంతూరికి వచ్చి వేరుశెనగ పంట వేయాలనుకున్నాడు. దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవటంతో... తండ్రి కష్టాన్ని గుర్తించిన ఇద్దరు కుమార్తెలు వెన్నెల, చందన.. కాడెద్దులుగా మారారు.

ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వారి చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్​ గండిపేట మహిళ కళాశాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ అడ్మిషన్ ఇవ్వటంతో పాటు... ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. సొంత ఊర్లో చదవాలనుకుంటే అవసరమైన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ తెలిపింది.

ఇదీ చదవండి:హోమ్‌ ఐసోలేషన్‌కే కరోనా బాధితుల మొగ్గు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details