NSUI has complained to the DGP: ప్రభుత్వం ఏడు లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మండిపడ్డారు. రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించిన ఆయన.. ఈమేరకు డీజీపీకి ఫిర్యాదు చేశారు. కటాఫ్ మార్కులలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
"ఎస్సై కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి" - NSUI protestors
NSUI has complained to the DGP: రాష్టంలో టీఎస్ఎల్ఆర్బీ నిర్వహించే ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక స్థాయి పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ కటాఫ్ మార్కులలో జరిగిన అవకతవకలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ డిమాండ్ చేశారు. 7లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన మండిపడ్డారు.
NSUI has complained to the DGP
తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రంలో తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు.. 22 మార్కులు ఇవ్వాలని ఆయన కోరారు. క్వాలీఫై మార్కులు వచ్చినప్పటికీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను లిస్ట్లో పెట్టలేదని ఆరోపించారు. బోర్డు తక్షణమే ప్రతి అభ్యర్థి మార్క్ లిస్ట్ రిలీజ్ చేయాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి: