కరోనా వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు దేశవిదేశాల నుంచి భారతీయులు సంఘీభావం తెలిపారు. స్వీడన్లో ఉండే రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రగన్నగూడకు చెందిన శ్రీ కృష్ణమల్లిక్ కుటుంబం ఈ కర్ఫ్యూకు మద్దతు ప్రకటించింది.
విదేశాలను తాకిన జనతా కర్ఫ్యూ
ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశమంతటా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించారు. అయితే ఇతర దేశాల్లోని భారతీయులు సైతం ఈ కర్ఫ్యూకు తమ మద్దతును తెలిపారు.
NRI
ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను పంపించారు. కంటికి కనిపించని కరోనా వైరస్తో పోరాడుతున్న వైద్యుల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. వైరస్ బారిన పడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి :సైబరాబాద్లో సజావుగా జనతా కర్ప్యూ: సీపీ సజ్జనార్