తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2020, 10:41 PM IST

ETV Bharat / state

విదేశాలను తాకిన జనతా కర్ఫ్యూ

ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశమంతటా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించారు. అయితే ఇతర దేశాల్లోని భారతీయులు సైతం ఈ కర్ఫ్యూకు తమ మద్దతును తెలిపారు.

NRI
NRI

కరోనా వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు దేశవిదేశాల నుంచి భారతీయులు సంఘీభావం తెలిపారు. స్వీడన్​లో ఉండే రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రగన్నగూడకు చెందిన శ్రీ కృష్ణమల్లిక్ కుటుంబం ఈ కర్ఫ్యూకు మద్దతు ప్రకటించింది.

ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను పంపించారు. కంటికి కనిపించని కరోనా వైరస్​తో పోరాడుతున్న వైద్యుల కృషికి కృతజ్ఞతలు తెలిపారు. వైరస్​ బారిన పడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి :సైబరాబాద్​లో సజావుగా జనతా కర్ప్యూ: సీపీ సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details