తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్​ఆర్​ఐతో పెళ్లి విషయంలో మహిళలూ... జర భద్రం !!

ఎన్​ఆర్​ఐ వివాహాలు, వరకట్నం, మహిళలపై వేధింపులపై పలు శాఖల సమన్వయం కోసం మహిళా భద్రత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ఠాణాల్లో 550కుపైగా వైవాహిక కేసులు నమోదయ్యాయని అన్నారు.

By

Published : Feb 14, 2020, 6:33 AM IST

Updated : Feb 14, 2020, 7:10 AM IST

ఎన్​ఆర్​ఐ వివాహాలు, వరకట్నం, మహిళలపై వేధింపులపై పలు శాఖల సమన్వయ సదస్సు
ఎన్​ఆర్​ఐ వివాహాలు, వరకట్నం, మహిళలపై వేధింపులపై పలు శాఖల సమన్వయ సదస్సు

ప్రవాస భారతీయులను పెళ్లి చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపారు. ఎన్ఆర్ఐ వివాహాలు, మహిళలపై వేధింపులు, వరకట్నం, మోసాలకు సంబంధించిన అంశాలపై సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల మధ్య అంతర్గత సహకారం, సమన్వయం కోసం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.

కొంతమంది మాయమాటలు చెప్పి... పెళ్లి చేసుకుని విదేశాలకు తీసుకెళ్లి అక్కడ భార్యలను ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని స్వాతి లక్రా తెలిపారు. మహిళా ఎన్ఆర్ఐ సెల్​తో పాటు రాష్ట్రంలోని పలు మహిళా ఠాణాల్లో 550కి పైగా వైవాహిక సంబంధిత కేసులు నమోదయ్యాయని అన్నారు.

అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే...

గతేడాది జూలైలో ప్రారంభించిన ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్ లో ఇప్పటివరకు 73 ఫిర్యాదులు అందగా వీటిలో 70 ఫిర్యాదులకు కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో 41 పెండింగ్ ట్రయల్స్​లో, 46 లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని స్వాతి లక్రా పేర్కొన్నారు.

గత ఆరేళ్లలో మొత్తం 574 ఎన్ఆర్ఐ కేసులు నమోదు చేశామని అన్నారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో అత్యధికంగా 248 కేసులు, రాచకొండ పరిధిలో 99 కేసులు, సైబరాబాద్ పరిధిలో 99, వరంగల్​లో 42 కేసులు నమోదయ్యాయి. ఎన్నారై వివాహాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచే ఆడియోను, కరపత్రాన్ని ఆమె విడుదల చేశారు.

ఎన్​ఆర్​ఐ వివాహాలు, మహిళలపై వేధింపులపై పలు శాఖల సమన్వయ సదస్సు

ఇవీ చూడండి : నిర్భయ దోషుల ఉరి మరింత ఆలస్యం..!

Last Updated : Feb 14, 2020, 7:10 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details