తెలంగాణ

telangana

By

Published : Jun 27, 2021, 5:15 PM IST

ETV Bharat / state

MP ARVIND: 'హుజూరాబాద్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా కేటీఆర్​ను ప్రకటించాలి'

మంత్రి కేటీఆర్​ను సీఎం చేసేందుకు అడ్డుపడుతున్నాడనే మాజీ మంత్రి ఈటలను పక్కకుపెట్టారని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. రానున్న హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో ఈటల భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెరాస అభ్యర్థిగా కేటీఆర్​ను ప్రకటించాలని ముఖ్యంత్రి కేసీఆర్​కు సవాల్​ విసిరారు.

హుజూరాబాద్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా కేటీఆర్​ను ప్రకటించాలి
హుజూరాబాద్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా కేటీఆర్​ను ప్రకటించాలి

రానున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో మంత్రి కేటీర్‌ను తెరాస అభ్యర్థిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సవాల్​ విసిరారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఈ ఉప ఎన్నికలు వచ్చాయని దుయ్యబట్టారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భాజపా నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అర్వింద్​ విమర్శించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల తర్వాత తెరాస పేకమేడలా కూలిపోతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ఈటల అడ్డుపడుతున్నాడని.. ఆ అక్కసుతోనే ఈటలను పక్కకుపెట్టారని ఆరోపించారు. కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్తు కోసమే ఈటలకు అన్యాయం చేశారన్నారు. ఎన్ని చేసినా కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావటం కలగానే మిగులుతుందని అన్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అర్వింద్​ పేర్కొన్నారు. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులను కొనుగోలు చేసే దుస్థితి తెరాసకు పట్టిందన్నారు. ఉప ఎన్నికల్లో ఈటల భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కేసీఆర్​ సార్​.! మా సమస్యలు వినండి.. ప్రగతి భవన్​ ఎదుట యువతి హల్​చల్​

ABOUT THE AUTHOR

...view details