తెలంగాణ

telangana

ETV Bharat / state

Rajeev kumar: తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: రాజీవ్​ కుమార్​ - rajeev kumar

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తోందని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితులతో తొమ్మిది శాతానికి పైగా వృద్ధిరేటు సాధిస్తోందని తెలిపారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధిని గుర్తించి కితాబిచ్చిన నీతిఆయోగ్​కు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

Niti aayog vice president rajeev kumar
నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్

By

Published : Sep 12, 2021, 4:30 PM IST

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ 9 శాతానికి మించిన వృద్ధి రేటు సాధిస్తోందని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ప్రశంసించారు. రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితుల వల్లే అది సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలోనే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రాజీవ్​ కుమార్ అన్నారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధిని గుర్తించి కితాబిచ్చిన నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్​ కుమార్​కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.

ట్విట్టర్​ ద్వారా కేటీఆర్​ కృతజ్ఞతలు

రాష్ట్ర అభివృద్ధిని గుర్తించినందుకు నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్​కు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ 9 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించడం మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:KTR: ఒకే చోట 15,660 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. అద్భుత దృశ్యం: కేటీఆర్‌ ట్వీట్‌

ABOUT THE AUTHOR

...view details