తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజధానిలో నిరాశ్రయులు... నిర్లక్ష్యంతో జీహెచ్​ఎంసీ - రాజధానిలో నిరాశ్రయులు... నిర్లక్ష్యంతో జీహెచ్​ఎంసీ

శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం... వేసవిలో ఎండలు ఠారెత్తడం... వర్షాకాలంలో గాలిదుమారంతో కూడిన వానలు కురుస్తాయి. ప్రకృతి కోపానికి జనాలు విలవిలలాడుతూనే ఉన్నారు. తల దాచుకునేందుకు నీడలేక రోడ్ల పక్కన పడుకుంటూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. రాష్ట్ర రాజధానిలో తగినన్ని నైట్​ షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్న జీహెచ్​ఎంసీ ... ఏళ్లు గడుస్తున్నా ఆ ముచ్చటే మరచిపోయింది.

night shelter problems in hyderabad

By

Published : Jul 11, 2019, 10:20 AM IST

భాగ్యనగరానికి ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు లక్షలాది మంది వస్తుంటారు. ఇందులో అధికశాతం ఆస్పత్రిలో రోగులవద్దకు వచ్చినవారుంటారు. వారు రహదారులు, జంక్షన్​ల వద్ద తాత్కాలికంగా బస చేస్తుంటారు. నగరంలో రహదారులు, ఫుట్​పాత్​లపై నిరాశ్రయులు లేకుండా జీహెచ్​ఎంసీ నైట్​ షెల్టర్లు ఏర్పాటు చేసింది. కానీ ఈ మహానగరానికి అవసరమైనదాంట్లో 10 శాతం కూడా ఆవాస కేంద్రాలు లేవు.

ఉన్న షెల్టర్లలో సదుపాయాల్లేవ్

ప్రజల అవసరానికి సరిపడా నైట్​ షెల్టర్ల సంఖ్య పెంచుతామని నాలుగేళ్లుగా జీహెచ్​ఎంసీ చెబుతూ వస్తోంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియని ప్రాంతాల్లో షెల్టర్లు ఉండటం వల్ల అక్కడికి వెళ్లి ఉండేవాళ్లు తగ్గిపోతున్నారు. ఉన్న షెల్టర్లలో కూడా కనీస సదుపాయాలు లేవు. సరైనన్ని పడకలు, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు లేకపోవడం వల్ల చాలా తక్కువ మంది మాత్రమే వీటిని వినియోగించుకుంటున్నారు.

ఇదేం సర్వే?

ఏడాదిన్నర క్రితం జీహెచ్​ఎంసీ సర్వే చేసి నగరంలో కేవలం 1491 మంది నిరాశ్రయులు ఉన్నట్లు గుర్తించారు. నాలుగేళ్ల క్రితమే 3వేల 500 మంది ఉండగా... ఏడాది క్రితం ఆ సంఖ్య సగం కంటే తగ్గిపోయింది. కోటిమంది జనాభా ఉన్న నగరంలో ఇంత తక్కువ నిరాశ్రయులుండటం ఏంటని ప్రజలు సైతం ఆశ్చర్యపోయేలా జీహెచ్​ఎంసీ వ్యవహరిస్తోంది.

ఆస్పత్రుల వద్దే ఉన్నాయి

ఆస్పత్రుల వద్ద ఎక్కువ మంది నిరాశ్రయులుంటున్నారని గుర్తించిన అధికారులు కింగ్‌కోఠీలోని ప్రసూతి ఆస్పత్రి, మాస‌బ్ ట్యాంక్ మ‌హ‌వీర్ ఆసుప‌త్రి, నీలోఫ‌ర్​తో పాటు మరో 10 చోట్ల నైట్​ షెల్టర్లు ఏర్పాటు చేశారు. వాటిలో పరిస్థితుల సంగతెలా ఉన్నా.. కనీస ఆశ్రయం లేక వేలాదిమంది రోడ్ల పక్కన, డివైడర్ల మీద, మూసివేసిన దుకాణాల ముందు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

పట్టించుకునే దిక్కేది

ఇలా రోడ్డు పక్కన పడుకున్న సమయంలో... కొందరు మందుబాబులు, దొంగలు వారిని చితకబాది డబ్బులు తీసుకుపోయిన సందర్భాలున్నాయి. రోడ్ల పక్కన, డివైడర్ల పైన పడుకోవడం వల్ల పలుమార్లు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నా.... అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

ఇదీ చూడండి : 'బారాత్'​ పైకి దూసుకెళ్లిన లారీ.. 8 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details