తెలంగాణ

telangana

బదిలీకి దరఖాస్తు.. అంతలోనే అనంతలోకాలకు...

జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్విభజనతో ఏర్పాటైన అబ్దుల్లాపూర్​ మెట్​ మండలానికి తొలి తహసీల్దార్​గా విజయారెడ్డి నియమితులయ్యారు. మూడేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న విజయ ఇటీవెలే బదిలీకై దరఖాస్తు చేసుకున్నారు. అంతలోనే ఇలా జరిగిందంటూ కార్యాలయ సిబ్బంది అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

By

Published : Nov 5, 2019, 11:35 AM IST

Published : Nov 5, 2019, 11:35 AM IST

కొత్త మండలం.. తొలి ఎమ్మార్వో

జిల్లాలు, రెవెన్యూ డివిజిన్లు, మండలాల పునర్విభజనతో ఏర్పాటైన కొత్త మండలం అబ్దుల్లాపూర్​ మెట్​. దీనికి తొలి తహసీల్దార్​ విజయారెడ్డి. అబ్దుల్లాపూర్​ మెట్​ మండలం ఏర్పాటుకు ముందు.. ఈ మండల పరిధిలోని 35 గ్రామాలతో పాటు హయత్​నగర్​ పరిధి ఆరు గ్రామాలతో కలిపి హయత్​నగర్​ మండలంగా కొనసాగింది. ఇది పూర్వ సరూర్​నగర్​ పరిధిలోకి వచ్చేది. రెవెన్యూ డివిజన్​ మండలాల పునర్విభజన తరువాత హయత్​నగర్​, అబ్దుల్లాపూర్​ మెట్​ వేర్వేరుగా ఏర్పాటయ్యాయి. హయత్​నగర్​ రెవెన్యూ డివిజన్​గా ఆవిర్భవించింది.

బదిలీకి దరఖాస్తు.. అంతలోనే ఇలా!

"ఇటీవలే మేడం బడిలీ కోసం దరఖాస్తు చేశారు. మూడేళ్లుగా ఇక్కడే ఉన్నారు కదా.. వేరొక చోటుకు వెళ్లాలనుకునేవారు". అని అబ్దుల్లాపూర్​ మెట్​ రెవెన్యూ కార్యాలయ సిబ్బంది చెప్పారు. విజయారెడ్డి మూడేళ్ల క్రితం మల్కాజ్​గిరి మండలం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారని పేర్కొన్నారు. అక్టోబర్​ 11న తహసీల్దారుగా నియమితులయ్యారని, బదిలీ కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.

ఆ భూమి సివిల్​ వివాదంలో...

"తహసీల్దారును సజీవ దహనం చేసిన ఘటన అత్యంత బాధాకరం. నిజానికి ఆ భూ వివాదం పూర్తిగా సివిల్​ విషయం.. తహసీల్దారు ఏమీ చేయలేని పరిస్థితి. ఈ విషయాన్ని నిందితుడితో ఆమె చెప్పినట్లు తెలిసింది. ఇటీవలె ఆమె బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు". అని రంగారెడ్డి జిల్లా ఇన్​ఛార్జి కలెక్టర్​ ఎస్​. హరీశ్​ తెలిపారు.

ఇదీ చూడండి: హత్యపై సమగ్ర విచారణ జరిపిస్తాం: మంత్రి సబితా

ABOUT THE AUTHOR

...view details