తెలంగాణ

telangana

By

Published : Sep 4, 2020, 9:29 PM IST

ETV Bharat / state

రైతుబంధు సమితి ఛైర్మన్​కు నూతన వాహనం

రాష్ట్ర రైతుబంధు సమితి ఛైర్మన్ కోసం కొత్త వాహనం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఛైర్మన్ కోసం ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేయాలన్న రైతుబంధు సమతి ఎండీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.

రైతుబంధు సమితి ఛైర్మన్​కు నూతన వాహనం
రైతుబంధు సమితి ఛైర్మన్​కు నూతన వాహనం

రైతుబంధు సమితి ఛైర్మన్ కోసం కొత్త వాహనం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఛైర్మన్ కోసం ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేయాలన్న రైతుబంధు సమతి ఎండీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. 27 లక్షల 61 వేల రూపాయలతో వాహన కొనుగోలుకు అనుమతిచ్చింది.

రైతుబంధు సాయాన్ని కొందరు తిరిగి ఇచ్చిన గివ్ ఇట్ అప్ నిధుల నుంచి వాహనాన్ని కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చూడండి:రష్యా వేదికగా రక్షణ మంత్రుల భేటీకి చైనా పిలుపు!

ABOUT THE AUTHOR

...view details