తెలంగాణ

telangana

ETV Bharat / state

బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ - New_Flyover_Opening by minister ktr at biodiversity junction

హైదరాబాద్​ బయోడైవర్సిటీ జంక్షన్​లో ఫస్ట్​లెవల్​ పైవంతెన నిర్మాణం పూర్తయింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఇవాళ ఫ్లైఓవర్​ను ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం, రాయదుర్గం వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్​ నుంచి కొంత ఉపశమనం కలగనుంది.

new-flyover-opening-by-minister-ktr-at-biodiversity-junction
బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

By

Published : May 21, 2020, 7:11 AM IST

హైదరాబాద్ బ‌యోడైవ‌ర్సిటీ జంక్షన్‌లో నిర్మించిన ఫ‌స్ట్ లెవల్‌ ఫ్లైఓవ‌ర్‌ను పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఎస్ఆర్​డీపీ ప్యాకేజీ-4 కింద రూ. 379 కోట్ల వ్యయంతో జేఎన్​టీయూ నుంచి బ‌యోడైవ‌ర్సిటీ వ‌ర‌కు 12 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పటివ‌ర‌కు ఐదు ప‌నుల‌ు ప్రారంభమయ్యాయి.

గ‌చ్చిబౌలి నుంచి మెహిదీప‌ట్నం, రాయ‌దుర్గం వెళ్లే వాహ‌న‌దారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. 690 మీటర్ల పొడవు, 11.50 మీటర్ల వెడల్పు ఉన్న పైవంతెనపై ఒకేవైపు వాహ‌నాల‌ను అనుమ‌తించనున్నారు.

ఇదీ చూడండి:పెట్రోల్​ బంక్​ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details