తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో మరో 684 కరోనా కేసులు, 3 మరణాలు - corona cases in telangana

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా రెక్కలు విప్పుకుంటోంది. మళ్లీ పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. తాజాగా... రాష్ట్రంలో 684 కొత్త కేసులు నమోదవగా... మరో ముగ్గురు కొవిడ్​ బారిన పడి మరణించారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 307,889కి చేరింది.

తెలంగాణలో మరో 684 కరోనా కేసులు
తెలంగాణలో మరో 684 కరోనా కేసులు

By

Published : Mar 31, 2021, 9:37 AM IST

Updated : Mar 31, 2021, 10:28 AM IST

రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా క్రియాశీల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1,907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 4,665కు పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 684 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 307,889కి చేరింది. తాజాగా 684 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 301,227మంది కోలుకున్నారు.

తాజాగా ముగ్గురు బలి

మరో ముగ్గురిని మహమ్మారి బలితీసుకోగా... మొత్తం మరణాలు 1697కు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,665 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,873 మంది ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 184 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 56,122 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.

సుమారు 47 శాతం వారికే..

కరోనా బారిన పడుతున్న వారిలో సుమారు 47 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావటం గమనార్హం. మహమ్మారి సోకిన వారిలో ఇటీవల చాలా స్వల్పంగానే లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం కరోనా సిప్టమ్స్ ఉన్నా.. తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని విన్నవిస్తోంది.

ఇదీ చదవండి:విధి నిర్వహణలో గాయపడిన ఏఎస్సై మహిపాల్​రెడ్డి మృతి

Last Updated : Mar 31, 2021, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details