New Bridges in Hyderabad: హైదరాబాద్లో మూసీ, ఈసీ నదులపై కొత్తగా వంతెనల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. మొత్తం రూ.545 కోట్ల వ్యయంతో 15 వంతెనల నిర్మాణం చేపట్టనుంది. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్- హెచ్ఆర్డీసీఎల్ ద్వారా వంతెనల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అఫ్జల్గంజ్ వద్ద మూసీ నదిపై పాదచారుల కోసం రూ.40 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. మూసీ నదిపై రూ.52 కోట్ల వ్యయంతో మిస్సింగ్ లింక్ కారిడార్ నంబరు 99 హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపనున్నారు.
బ్రిడ్జిలే బ్రిడ్జిలు...
మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్వే వద్ద హైవెల్ బ్రిడ్జి అనుసంధానం కోసం రూ.39 కోట్లు వెచ్చించనున్నారు. ఈసీ నదిపై చింతల్మెట్- సన్సిటీ మధ్య అనుసంధానిస్తూ రూ.32 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈసీ నదిపై బండ్లగూడ జాగీర్ వద్ద ఐఆర్ఆర్- కిస్మత్పూర్ రోడ్డుపై రూ.32 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై రూ.52 కోట్ల వ్యయంతో హైలెవల్ వంతెన నిర్మాణం జరగనుంది. చాదర్ఘాట్ వద్ద మూసీపై రూ.42 కోట్ల వ్యయంతో మరొక బ్రిడ్జి కూడా నిర్మించనున్నారు. ఎగువన అత్తాపూర్ వద్ద మూసీపై రూ.35 కోట్ల వ్యయంతో కొత్తగా సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు.
మరికొన్ని...