తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2021, 9:16 PM IST

ETV Bharat / state

ఏపీలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినుంచి మరో 71 మంది కోలుకున్నారు. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,89,339కి చేరింది.

new-41-corona-cases-registered-in-andhra-pradesh
ఏపీలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​లో 18,257 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 41 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,89,339కి చేరిందని అధికారులు వెల్లడించారు.

ఏపీలో కొత్తగా 71 మంది బాధితులు కోలుకోగా... మొత్తం కోలుకున్న వారిసంఖ్య 8.81 లక్షలకు చేరిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనాతో 7,167 మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో కోటి 37 లక్షల కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

ఏపీలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదు

ఇదీ చదవండి:'భారత్​లో కరోనా పాజిటివిటీ రేటు 5.2%'

ABOUT THE AUTHOR

...view details