తెలంగాణ

telangana

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 316 కరోనా కేసులు.. 5 మరణాలు

By

Published : Dec 7, 2020, 8:16 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 316 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,72,288కు చేరింది. తాజాగా మరో ఐదుగురు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్​లో పేర్కొంది.

AP NEWS
ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 316 కరోనా కేసులు.. 5 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 43,006 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 316 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారిన పడి ఐదుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్​లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,72,288కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 595 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8.59 లక్షల మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో ఆ రాష్ట్రంలో మొత్తం 7,038 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ఏపీ వ్యాప్తంగా 5,626 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 1,04,53,618 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

వివరాలిలా...

ABOUT THE AUTHOR

...view details