తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 4:48 AM IST

Updated : Oct 7, 2020, 6:22 AM IST

ETV Bharat / state

ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైన నెహ్రు జూలాజికల్‌ పార్క్‌

కరోనా కారణంగా మూతపడిన నెహ్రు జూలాజికల్‌ పార్క్‌... దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సందర్శకులకు అనుమతిస్తున్నారు. ప్రారంభమైన మొదటిరోజే 1,137 మంది జూపార్క్ ను సందర్శించారు.

nehru zoological park opened in hyderabad
ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైన నెహ్రు జూలాజికల్‌ పార్క్‌

ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైన నెహ్రు జూలాజికల్‌ పార్క్‌

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా పార్కులు, జంతు ప్రదర్శనశాలలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన నెహ్రు జూలాజికల్‌ పార్కు మళ్లీ ప్రారంభంకావటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా.. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన అనంతరం మాస్కులు ధరించిన వారినే అనుమతిస్తున్నారు. టికెట్‌ కౌంటర్ల వద్ద భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

ఉమ్మితే వెయ్యి రూపాయలు జరిమానా

లాక్‌డౌన్‌ కాలంలో పార్కును పరిశుభ్రంగా ఉంచామని అధికారులు చెప్పారు. జంతువులు ఉండేటువంటి ఎన్ క్లోజర్లను రోజుకు రెండుసార్లు శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపారు. వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పార్కులో ఉమ్మిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇరుకుగా ఉండటం వల్ల సరిసృపాలు, నిశాచర జంతుశాల, ఎక్వేరియం, ఫాజిల్ మ్యూజియం, హిస్టరీ మ్యూజియం మూసివేశామని అధికారులు వెల్లడించారు.

సందర్శకుల తాకిడి

జూపార్కు తిరిగి ప్రారంభించడంతో మొదటి రోజు నుంచే సందర్శకుల తాకిడి ప్రారంభమైంది. ఒక్కరోజే 1,137 మంది పార్కును సందర్శించారు. కుటుంబ సభ్యలుతో కలిసి పార్కులో ఆహ్లదంగా గడిపారు. చాలా రోజుల తర్వాత జంతువులను చూసి పిల్లలు ఆనందంతో గెంతులు వేశారు. అయితే... జూలో అన్ని జంతువులు అందుబాటులో లేవని సందర్శకులు తెలిపారు. కొద్ది రోజులుగా ఇళ్లకే పరిమితమైన నగరవాసులకు జూపార్క్ అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:కేసీఆర్​ తన వైఫల్యాలను ఒప్పుకోవడం తప్ప చేసిందేమి లేదు: బండి సంజయ్​

Last Updated : Oct 7, 2020, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details