రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు.. రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు జరిగాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. వ్యక్తి గత భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ఎస్పీపేర్కొన్నారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్పై అవగాహన కల్పిస్తామని.. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.