హైదరాబాద్ నగరంలో ఒకే వేదికపై 55 మంది చిత్రాకారుల చిత్రకళా ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. జాతీయ స్థాయి చిత్రకారులతో పాటు కొత్తగా ఈ రంగంలో ప్రవేశించిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంటోంది.
భాగ్యనగరంలో జాతీయ స్థాయి చిత్రకారుల ప్రదర్శన
భాగ్యనగరంలో ఒకే వేదికపై 55 మంది చిత్రాకారుల కళా ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. వర్ధమాన చిత్రాకారుల కలం నుంచి జాలువారిన పలు వర్ణచిత్రాలను అభినందిస్తున్నారు.
భాగ్యనగరంలో జాతీయ స్థాయి చిత్రకారుల ప్రదర్శన
గెలారియో డీ ఆర్ట్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు ఉన్నతాధికారులు, చిత్రాభిమానులు సందర్శిస్తూ అభినందిస్తున్నారు. కేవలం కళాకారులను ప్రోత్సహించడం మాత్రమే కాకుండ, పేద కళాకారులను, విద్యార్థులకు వచ్చిన నిధులల్లో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'