తెలంగాణ

telangana

ETV Bharat / state

'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్'

విద్యుత్​ పొదుపు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఈఆర్సీ ఛైర్మన్​ రంగారావు తెలిపారు. జాతీయ పొదుపు వారోత్సవాల్లో భాగంగా నెక్లెస్​రోడ్​లో అవగాహన నడక నిర్వహించారు.

By

Published : Dec 15, 2019, 11:28 AM IST

National Energy Day Walk in hyderabad
'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్'

జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లో అవగాహన నడక నిర్వహించారు. ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్​ సెంటర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. పీపుల్స్​ ప్లాజా నుంచి ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వరకు సాగిన ఈ నడకలో... ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు , మిషన్ ఛైర్మన్ ఈ. శ్రీనివాసచారి, ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్​ సెంటర్ ఛైర్మన్ రామేశ్వర్​రావు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఈఆర్సీ ఛైర్మన్ రంగారావు కోరారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంపై 'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్' పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్'

ABOUT THE AUTHOR

...view details