తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన మందులు అందించిన నాట్కో ఫార్మా - తెలంగాణ వార్తలు

కరోనా చికిత్సలో ఉపయోగించే బారిసిటినిబ్ మందులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.4కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్​కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలిపారు.

Natco pharma company, minister ktr
నాట్కా ఫార్మా కంపెనీ, మంత్రి కేటీఆర్

By

Published : May 14, 2021, 5:46 PM IST

కొవిడ్ చికిత్సలో వినియోగించే విలువైన బారిసిటినిబ్ మందులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈమేరకు కంపెనీ సీఈవో రాజీవ్ నన్నపనేని రూ.4.2 కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్​కు అందజేశారు.

కొవిడ్​పై పోరులో భాగంగా కీలకమైన మందులను ప్రభుత్వానికి అందజేసి.. బాధితుల చికిత్సకు తోడ్పాటునందించినందుకు మంత్రి కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి:గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక 76మంది మృతి

ABOUT THE AUTHOR

...view details