కొవిడ్ చికిత్సలో వినియోగించే విలువైన బారిసిటినిబ్ మందులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈమేరకు కంపెనీ సీఈవో రాజీవ్ నన్నపనేని రూ.4.2 కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్కు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన మందులు అందించిన నాట్కో ఫార్మా - తెలంగాణ వార్తలు
కరోనా చికిత్సలో ఉపయోగించే బారిసిటినిబ్ మందులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు నాట్కో ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.4కోట్ల విలువైన మందులను మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలిపారు.

నాట్కా ఫార్మా కంపెనీ, మంత్రి కేటీఆర్
కొవిడ్పై పోరులో భాగంగా కీలకమైన మందులను ప్రభుత్వానికి అందజేసి.. బాధితుల చికిత్సకు తోడ్పాటునందించినందుకు మంత్రి కేటీఆర్ నాట్కో ఫార్మాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి:గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 76మంది మృతి