తెలంగాణ

telangana

ETV Bharat / state

టీడీపీ అధికారంలోకి వచ్చాక.. అరటి రైతులపై ప్రత్యేక దృష్టి: లోకేశ్​ - YUVAGALAM PADAYATRA

LOKESH YUVAGALAM PADAYATRA: ఆంధ్రప్రదేశ్​లో నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో అయిదో రోజు కొనసాగుతోంది. కొమ్మరమడుగులో పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అరటి రైతులతో భేటీ అయిన ఆయన.. వారి సమస్యలు తెలుసుకున్నారు.

Lokesh Padayathra in Chittore
Lokesh Padayathra in Chittore

By

Published : Jan 31, 2023, 3:28 PM IST

LOKESH YUVAGALAM PADAYATRA: ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అరటి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరిస్తామని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కొమ్మరమడుగులో పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన అరటి రైతులతో భేటీ అయిన ఆయన.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎకరానికి మూడున్నర లక్షల పెట్టుబడి అవుతోందని రైతులు లోకేశ్‌ ఎదుట వాపోయారు. ఎరువులు, కూలీలు, విత్తనం ధర భారీగా పెరిగాయన్నారు. కిలోకు 15 రూపాయల ధర కూడా రావడం లేదన్నారు. వారి సమస్యలు విన్న లోకేశ్‌.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా పోరాడతానన్నారు.

పలమనేరు నియోజకవర్గంలో నారా లోకేశ్‌ పాదయాత్ర ఐదో రోజు ఉత్సాహంగా సాగుతోంది. కృష్ణాపురం టోల్‌గేట్ నుంచి పాద‌యాత్ర ప్రారంభించిన లోకేశ్‌.. క‌స్తూరి న‌గ‌రం క్రాస్ వ‌ద్ద గౌడ సామాజిక‌వ‌ర్గంతో భేటీ కానున్నారు. కైగ‌ల్లు వ‌ద్ద యాద‌వ సామాజిక‌వ‌ర్గం, మ‌ధ్యాహ్నం దేవ‌దొడ్డి గ్రామంలో కురుమ సామాజిక‌వ‌ర్గంతో భేటీ అవుతారు. సాయంత్రం బైరెడ్డిప‌ల్లెలో బీసీ క‌మ్యూనిటీ సమావేశంలో పాల్గొంటారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details