తెలంగాణ

telangana

ETV Bharat / state

'నన్నపనేని రాజకుమారి.. వెంటనే క్షమాపణలు చెప్పాలి' - ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి

ఎస్సీ మహిళా ఎస్సైని ఏపీ మహిళ కమిషన్ మాజీ ఛైర్​ పర్సన్ తీవ్ర వ్యాఖ్యలతో దూషించడం పట్ల మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల ఐకాస నేతలు తీవ్రంగా ఖండించారు. వెంటనే ఎస్సై అనురాధకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎంకెన్నాళ్లీ అవమానాలు ? తక్షణమే క్షమాపణలు చెప్పాలి : ఐకాస

By

Published : Sep 14, 2019, 6:40 PM IST

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఎస్సీ కులానికి చెందిన మహిళా ఎస్ఐపై చేసిన వ్యాఖ్యలను మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల ఐకాస తీవ్రంగా ఖండించింది. స్త్రీని, కులాన్ని, లింగాన్ని ఉద్దేశించి రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు రోజు రోజుకు శ్రుతిమించిపోతున్నాయని ఐకాస నాయకురాళ్లు హైదరాబాద్​లో ఆందోళన వ్యక్తం చేశారు.
ఆత్మకూరులో తెదేపా చేస్తున్న నిరసనలో ఎస్సీ ఎస్ఐ అనురాధపై ఆ వర్గాన్ని కించపరిచే విధంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడడం సరికాదన్నారు. ఈ రకమైన అధిపత్య కుల అహంభావాన్ని చూపిస్తున్న వారిని ఆయా పార్టీ నాయకత్వాలు బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూడా నోటి దురుసుతో మాట్లాడారని గుర్తు చేశారు. వెంటనే ఎస్ఐ అనురాధకు క్షమాపణలు చెప్పి పరుష పదజాలాన్ని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఐకాస డిమాండ్ చేసింది.

ఎంకెన్నాళ్లీ అవమానాలు ? తక్షణమే క్షమాపణలు చెప్పాలి : ఐకాస

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details