రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోను అభివృద్ధి చేసేందుకు తెరాస సర్కారు ప్రయత్నిస్తోందని నాంపల్లి నియోజకవర్గ తెరాస నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. నూతన రెవెన్యూ చట్టం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
'నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం' - హైదరాబాద్ తాజా వార్తలు
భవిష్యత్ అవసరాలకోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని నాంపల్లి నియోజకవర్గ తెరాస కార్యకర్తలు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
'నూతన రెవన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం'
గుడిమల్కాపూర్ గోల్డెన్ ప్యాలెస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి... మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో తెరాస గుడిమల్కాపూర్ కార్పొరేటర్ బంగారి ప్రకాష్ గంగపుత్ర, అరుణ్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు.