తెలంగాణ

telangana

ETV Bharat / state

వీఎస్​​టీ కార్మిక సంఘం ఎన్నికల బరిలో నాయిని అల్లుడు

వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ కార్మికుల సంక్షేమం కోసం గత రెండు పర్యాయాలుగా కృషి చేస్తున్నానని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు కార్పొరేటర్ వీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 6న జరిగే వీఎస్​​టీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తనను గెలిపించాలని కార్మికులను కోరారు.

By

Published : Dec 31, 2020, 2:50 PM IST

Updated : Dec 31, 2020, 9:31 PM IST

VST labor union recognition election
వీఎస్​​టీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు

వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ కార్మికుల సంక్షేమం కోసం గత మూడు పర్యాయాలుగా కృషి చేశానని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు కార్పొరేటర్ వీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 6న జరిగే వీఎస్​​టీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో తనను గెలిపించాలని కార్మికులను కోరారు.

అడిక్ మెట్​ డివిజన్​లోని కట్ట మైసమ్మ దేవాలయంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపుగా ఆర్టీసీ క్రాస్​రోడ్​​లోని కార్మికశాఖ కార్యాలయానికి వచ్చారు. జై భవాని ఎన్​ఎన్ఆర్ గ్రూప్ నుంచి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి:బేబీబంప్​తో అనుష్క శర్మ.. ఫొటోలు వైరల్​

Last Updated : Dec 31, 2020, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details