తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐటీ దాడులపై వివరణ ఇచ్చిన మైహోమ్​ సంస్థ

ఐటీ దాడులపై మైహోమ్​ సంస్థ వివరణ ఇచ్చింది. అధికారులు కోరిన సమాచారాన్ని అందజేశామని సంస్థ యాజమాన్యం తెలిపింది.

By

Published : Jul 7, 2019, 8:01 AM IST

ఐటీ దాడులపై వివరణ ఇచ్చిన మైహోమ్​ సంస్థ

బెంగళూర్​కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో జరిగిన ఐటీ దాడుల్లో భాగంగానే.. మై హోమ్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహించినట్లు మై హోమ్ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. బెంగళూర్ సంస్థతో కలిసి హైదరాబాద్​లో ఓ ప్రాజెక్టులో ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్నట్లు మైహోమ్ తెలిపింది. ఐటీ అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని అందించినట్లు మై హోం యాజమాన్యం తెలిపింది. వ్యాపార కార్యకలాపాలన్నీ విలువలకు, నియమాలకు లోబడి సాగుతున్నాయని.... కార్పొరేట్ గవర్నెన్స్​ నిబంధనలను పాటిస్తున్నట్లు తెలిపారు. పన్ను చట్టాలను, నియంత్రణా సంస్థల నిబంధనలను పాటిస్తున్నట్లు మై హోమ్ గ్రూప్ వెల్లడించింది.

ఐటీ దాడులపై వివరణ ఇచ్చిన మైహోమ్​ సంస్థ

ABOUT THE AUTHOR

...view details