జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత భాజపా బలం పెరుగుతుందని తెరాస తగ్గుతుందని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్రావు అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని చెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా ప్రత్యామ్నాయం కాబోతుందని పేర్కొన్నారు. తెరాస భయాలు సృష్టించి.. ఓట్ల లబ్ది పొందుతుందని ఆరోపించారు. దుబ్బాకలో భాజపా విజయంతో తెరాస నేతల్లో భయం పట్టుకుందని విమర్శించారు.