తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2019, 3:49 PM IST

Updated : Mar 28, 2019, 5:10 PM IST

ETV Bharat / state

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి దశ ఘట్టం ముగిసింది. పలు నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్​లో పసుపు రైతులు వెనక్కి తగ్గలేదు. అక్కడ బ్యాలెట్ పోరు జరపాలని ఈసీ నిర్ణయించింది.

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
లోక్​సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరి రోజు పలు రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కొందరు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. నిజామాబాద్​లో ఇవాళ నలుగురే ఉపసంహరించుకున్నారు. వీరిలో ముగ్గురు రైతులు, ఓ స్వతంత్ర్య అభ్యర్థి ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా 185 మంది తుదిపోరులో నిలిచారు. వీరిలో 178 మంది ఎర్రజొన్న, పసుపు రైతులే. ఈ స్థానంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మిగతా అన్ని చోట్ల ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వచ్చే నెల 11న తెలుగు రాష్ట్రాలతో సహా 91 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
Last Updated : Mar 28, 2019, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details