తెలంగాణ

telangana

By

Published : Jan 20, 2021, 4:37 PM IST

ETV Bharat / state

'ఉచిత మంచినీటి సరఫరాను కంటోన్మెంట్‌కు వర్తింపజేయండి'

ఉచిత తాగునీటి పథకాన్ని కంటోన్మెంట్ ప్రాంతానికి వర్తింపజేయాలని ఎమ్మార్పీఎస్ నేతలు కోరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు వినతి పత్రం అందజేశారు.

MRPS leaders demanded that the free drinking water scheme be extended to the cantonment area. The petition was handed over to the Cantonment MLA.
'ఉచిత మంచినీటి సరఫరాను కంటోన్మెంట్‌కు వర్తింపజేయండి'

గ్రేటర్​లో అమలవుతున్న ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని కంటోన్మెంట్ ప్రాంతానికి వర్తింపజేసేలా తగు చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్​ నేతలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు ఆ సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.

బలహీన వర్గాలు..

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మీడియా కన్వీనర్ ఇటుక గోపి మాదిగ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ప్రాంతంలో అత్యధికంగా బడుగు, బలహీన వర్గాలు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తారని తెలిపిన ఆయన.. గ్రేటర్ పరిధిలో అమలుపరచిన ఉచిత తాగునీటి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సాయన్న సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ పథకానికి శ్రీకారం చుడుతామని హామీ ఇచ్చినట్లు ఇటుక గోపి తెలిపారు.

ఇదీ చదవండి:సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు: నిజామాబాద్ ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details