MP YS Avinash Reddy letter to CBI : వివేకా హత్య కేసులో తన ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందంటూ.. ఆంధ్రప్రదేశ్లోని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం జరగకుండా చూడాలని కోరారు. వివేకా హత్య కేసు విచారణ పారదర్శకంగా జరగాలని, సీబీఐ విచారణను రికార్డ్ చేసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. తనతో పాటు ఓ న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చి.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..
సీబీఐ అధికారులకు ఏపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ - ys vivek murder case latest news
MP YS Avinash Reddy letter to CBI : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఈ రోజు సాయంత్రం 3గంటలకు కడప ఎంపీ అవినాష్రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐకి లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే..?
![సీబీఐ అధికారులకు ఏపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ Kadapa MP Avinash Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17602678-704-17602678-1674889480288.jpg)
కడప ఎంపీ అవినాష్రెడ్డి
వైఎస్ విజయమ్మతో భేటీ..అంతకముందు లోటస్పాండ్కు వెళ్లినట్లు వైఎస్ అవినాష్ తెలిపారు. అక్కడ వైఎస్ విజయమ్మతో కలిసి మాట్లాడినట్లు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు అవినాష్రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి :