తెరాస, భాజపా ఆత్మ ఒక్కటే.. శరీరాలే వేరని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడు కుస్తీ.. ఆ తర్వాత దోస్తీ.. ఏడేళ్లుగా కేసీఆర్ అదే చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్.. ఉత్తర కుమారుడిలా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
దీక్షకు సిద్ధమా..
కేటీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన చట్టంలో హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాల కోసం దిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమా అని సవాల్ చేశారు. తెరాస, భాజపా ఒక్కటి కాకుంటే సవాల్ స్వీకరించాలని కోరారు.