తెలంగాణ

telangana

వరద సాయంపై సీఎం కేసీఆర్​కు ఎంపీ రేవంత్​ రెడ్డి లేఖ రాసిన

By

Published : Oct 31, 2020, 9:00 PM IST

వరద సహాయంపై సీఎం కేసీఆర్​కు ఎంపీ రేవంత్​ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్​లో వరద సాయాన్ని కూడా అధికార పార్టీ నేతలు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.

mp revanth reddy wrote a letter to cm kcr on flood victims financial help
వరద సహాయంపై సీఎం కేసీఆర్​కు లేఖ రాసిన ఎంపీ రేవంత్ రెడ్డి​

హైదరాబాద్​లో వరద సాయాన్ని కూడా అధికార పార్టీ నేతలు స్వాహా చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరుకు సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. తెరాస కార్పొరేటర్లు, స్థానిక నాయకులు చూస్తుంటే వీళ్లు మనుషులేనా..? వీళ్లకు మానవత్వం ఉందా అని అనిపిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

గ్రేటర్‌లో ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతోనే ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని సూచించారు. ఇప్పటి వరకు పరిహారం పంపిణీపై విజిలెన్స్‌ విచారణ చేయించాలన్నారు. లేదంటే క్షేత్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:బాధితులందరికీ తక్షణ సాయం అందిస్తాం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details