కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారిన ఖైదీలు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెలాఖరు వరకు లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వం... పలు జైళ్లలో వేలాది ఖైదీలు ఒకేచోట ఉంటున్న విషయాన్ని విస్మరించిందన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో దాదాపు రెండు వేల మంది ఖైదీలు, రెండు వందల మంది జైలు సిబ్బంది ఉన్నారని గుర్తు చేశారు.
సీఎందే బాధ్యత...