తెలంగాణ

telangana

ETV Bharat / state

త్రించింగ్​ పాయింట్​ను సందర్శించిన కంటోన్మెంట్​ డీజీడీఈ దీప - కంటోన్మెంట్​ బోర్డు తాజావార్త

కంటోన్మెంట్​ డీజీడీఈ అధికారి దీప బజువ సికింద్రాబాద్​ హస్మత్​పేటలో ఉన్న త్రించింగ్​ పాయింట్​ను సందర్శించారు. ఎంపీ రేవంత్​రెడ్డి, కంటోన్మెంట్​ బోర్డు సభ్యుడు సాయన్నలతో కలిసి బోర్డు సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

mp revanth reddy cantonment board member sayanna attend cantonment board meeting held by dgde deepa in secunderabad
త్రించింగ్​ పాయింట్​ను సందర్శించిన కంటోన్మెంట్​ డీజీడీఈ దీప

By

Published : Feb 27, 2020, 10:49 AM IST

సికింద్రాబాద్ హస్మత్​పేటలో ఉన్న త్రించింగ్ పాయింట్ ప్రాంతాన్ని కంటోన్మెంట్ డీజీడీఈ అధికారి దీప బజువ సందర్శించారు. అనంతరం బోర్డు కార్యాలయానికి చేరుకుని సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ సీఈవో చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ భేటీకి మల్కాజ్​గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్ శాసన సభ్యుడు సాయన్న హాజరయ్యారు.

గత కొన్నేళ్లుగా దీర్ఘకాలికంగా ఉన్న రామన్న కుంట చెరువు సుందరీకరణ, బొల్లారంలోని వంద పడకల ఆసుపత్రి వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు సాగాయి. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై చర్యలు తీసుకుంటామని బోర్డు సభ్యులకు ఆమె హామీ ఇచ్చారు.

భవన నిర్మాణ అనుమతుల విషయంలో కూడా మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు తెలిపారు. డీజీడీఈ రాకతో కంటోన్మెంట్లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశాలున్నాయని బోర్డు సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

త్రించింగ్​ పాయింట్​ను సందర్శించిన కంటోన్మెంట్​ డీజీడీఈ దీప

ఇదీ చూడండి :'ఆలయాల పేరుతో అక్రమాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు?'

ABOUT THE AUTHOR

...view details