MP Nama Fire on Central Govt: సింగరేణి ప్రైవేటుపరం చేయబోమని చెప్పి ఇప్పుడు కేంద్రం బ్లాకులు వేలం వేయడానికి సిద్ధపడుతోందని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. సింగరేణి వాటలో కేంద్రానికి ఉన్న 49 శాతం వాటా రాష్ట్రం తీసుకుంటుందని చెప్పినా కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
'సింగరేణిని ప్రైవేటుపరం చేయమని చెప్పి.. బొగ్గు గనులు ఎందుకు వేలం వేస్తున్నారు..' - Central Government share in Singareni
MP Nama Fire on Central Govt: తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పి ఇప్పుడు బ్లాకులు వేలం వేయాలని చూస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఆరోపించారు.

MP Nama Nageshwar Rao
తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని విమర్శించిన ఆయన.. విధాన పరమైన నిర్ణయంతో వేలం వేశామని కేంద్రం అంటుండడం విడ్డురంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు తీసుకునేలా కేంద్రం చట్టం తీసుకురావడం చాలా బాధాకరమని అన్నారు. ఇకనైనా రాష్ట్ర అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలిని నామ సూచించారు.
ఇవీ చదవండి: