కేసీఆర్ నిర్ణయాలను చూస్తుంటే తుగ్లక్కే పిచ్చి పట్టేట్టుగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగుల పైన ప్రేమ పుట్టుకువచ్చిందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాలు పెంపు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్ తీరు మారకుంటే.. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం: కోమటిరెడ్డి - కేసీఆర్ పాలనపై ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాలు పెంపు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ తన నియంతృత్వ పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.
![కేసీఆర్ తీరు మారకుంటే.. ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం: కోమటిరెడ్డి mp komati reddy comments on cm kcr ruling](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10057443-942-10057443-1609318791379.jpg)
'కేసీఆర్ పాలన చూస్తే తుగ్లక్కే పిచ్చి పట్టేలా ఉంది'
ఎల్ఆర్ఎస్ను శాశ్వతంగా రద్దు చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం కేసీఆర్, తెరాస పార్టీని ప్రజలు శాశ్వతంగా రద్దు చేస్తారని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాలు, పోరాటాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తామని పేర్కొన్నారు.