తెలంగాణ

telangana

ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య

By

Published : Sep 11, 2020, 7:14 PM IST

కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీ చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో జరిగింది.

ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య

ఏపీలోని చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలాజీ కాలనీలో నివాసముంటున్న వెంకటరమణకు గౌతమితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గత కొంత కాలంగా గౌతమికి, వెంకటరమణతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె... తన ఇద్దరు కుమారులతో సహా చల్లగుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను గమనించిన స్థానిక రైతులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'మహా' విలయం- కొత్తగా 23,446 కేసులు

ABOUT THE AUTHOR

...view details