గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలోని ఆదర్శనగర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఇంటితోపాటు అందులో ఉన్న తల్లి బిడ్డ సజీవ దహనమయ్యారు. దీనికి కారణం షార్ట్ సర్క్యూట్ అని స్థానికులంటున్నారు. తల్లితో సహా కొడుకు మౌలాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని బంధువులు చెప్తున్నారు. విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కళ్లు తెరిచేలోపే... కాలిపోయారు - షార్ట్ సర్యూట్తో తల్లి కొడుకు సజీవదహనం
ఇంట్లో తల్లీకొడుకు హాయిగా నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్య్కూట్ అయి ఇల్లాంతా కాలిపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఇద్దరు సజీవ దహనమైపోయారు. ఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కళ్లు తెరిచే లోపే... కాలిపోయారు