తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సమయంలోనూ ఉస్మానియా ఘనత - millions of people Tested osmania university

కరోనా కాలంలోనూ ఉస్మానియా విశ్వవిద్యాలయం లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి రికార్డు సృష్టించింది. మొదటిసారిగా పీజీ పరీక్షలను ఓయూ పరిధి దాటి ఇతర జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

More tests in conducted in corona time at Osmania university
కరోనా సమయంలోనూ ఘనతను సాధించిన ఉస్మానియా

By

Published : Dec 18, 2020, 7:14 AM IST

కొవిడ్‌ వాతావరణంలోనూ తక్కువ సమయంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం లక్షలాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. సెప్టెంబరు 17 నుంచి తొలుత అన్ని కోర్సుల చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభించింది. తర్వాత మిగిలిన విద్యార్థులతోపాటు బ్యాక్‌లాగ్‌లకు నిర్వహించింది.

రికార్డని తెలిపిన అధికారులు

ఇప్పటివరకు 5,07,306 మంది వివిధ దఫాలుగా రాశారు. 14.74 లక్షల జవాబుపత్రాలు వర్సిటీకి అందాయి. ఇదో రికార్డని అధికారులు తెలిపారు. ఈ నెలలో 59 కోర్సులకు చెందిన మరో 55,585 మంది రాస్తారు. తొలిసారి పీజీ పరీక్షలకు ఓయూ పరిధి దాటి.. ఇతర జిల్లాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేశామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్‌ వెంకటేశ్‌ తెలిపారు. ఆన్‌స్క్రీన్‌ మూల్యాంకనంతో ఫలితాలు త్వరగా ఇస్తున్నామని అన్నారు.

ఓయూకు మరో అవకాశం

భారత నావిగేషన్‌ వ్యవస్థ(నావిక్‌)కు సంబంధించిన ప్రయోగాలు చేపట్టేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మరోసారి అవకాశం దక్కింది. ఈ వ్యవస్థకు సంబంధించి 2017లో అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల పనితీరును పరీక్షించేందుకు.. అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌(శాక్‌)తో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర న్యాయశాఖ, కేంద్ర పరిశ్రమల, అంతర్గత ట్రేడ్‌ ప్రమోషన్‌ విభాగం నుంచి గురువారం అధికారిక ఆదేశాలు అందాయి.

ఇదీ చూడండి :మరో 9 వేల పోస్టుల భర్తీ... కార్పొరేషన్లు, సొసైటీల్లోనూ నియమాకాలు...!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details