తెలంగాణ

telangana

ETV Bharat / state

శంషాబాద్ విమానాశ్రయం నుంచి యూఏఈకు మరిన్ని సర్వీసులు - Covid 19 news today at Airport

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా ద్వారా ఇతర దేశాలకు విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య ‘ఎయిర్ ట్రావెల్ బబుల్’ ఒప్పందం ప్రకారం విమాన సర్వీసులు ఎగరనున్నాయి. కొవిడ్-19 భద్రతా నిబంధనలకు లోబడి పరీక్షల థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ప్రయాణానికి అనుమతించనున్నారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి యూఏఈకు మరిన్ని సర్వీసులు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి యూఏఈకు మరిన్ని సర్వీసులు

By

Published : Sep 12, 2020, 6:00 PM IST

ఇతర దేశాలకు విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా, భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఎయిర్ ట్రాన్స్​పోర్ట్ బబుల్’ ఒప్పందం ప్రకారం జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయి, షార్జాలకు మూడు ఎయిర్‌లైన్స్ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్లి, తిరిగి రావడానికి ఎమిరేట్స్ లేదా ఫ్లై దుబాయి విమాన సర్వీసులు నడవనున్నాయి. షార్జా- హైదరాబాద్‌ల మధ్య ప్రయాణించాలనుకున్న వారు ఎయిర్ అరేబియా సర్వీస్ ద్వారా ప్రయాణాలు సాగించవచ్చని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

వారానికి మూడు రోజుల సర్వీస్..

ఎమిరేట్స్ సహా ఫ్లై దుబాయి సర్వీసులు హైదరాబాద్, దుబాయి మధ్య వారానికి మూడు రోజుల సర్వీసులతో పున:ప్రారంభమయ్యాయి. ఎమిరేట్స్ మంగళ, గురు, ఆదివారాల్లో సేవలు అందిస్తే, ఫ్లై దుబాయ్ సోమ, బుధ, శనివారాల్లో సర్వీస్ ఆపరేట్ చేయనుంది. ఎయిర్ అరేబియా కూడా హైదరాబాద్, షార్జాల మధ్య వారానికి మూడు రోజుల సర్వీసులను పున: ప్రారంభించింది. ఇవి బుధ, శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి.

మార్గదర్శకాల ఆధారంగా..

కేంద్ర హాంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయి, షార్జాలకు ఆయా ఎయిర్ లైన్స్ నుంచి తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయాణికులంతా కొవిడ్-19 మార్గదర్శకాలకు లోబడే ప్రయాణాలు సాగించాలని సూచించాయి.

పూర్తిగా శానిటైజ్ చేశాకే..

ప్రయాణికులందరినీ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా శానిటైజ్ చేసిన తరువాతే ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ ద్వారా విమానంలోకి అనుమతిస్తామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. టెర్మినల్‌లో ప్రవేశించే ముందే ప్రయాణికులందరికీ కొవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తామన్నారు. పలు భద్రతా చర్యల అనంతరం, తగిన భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్‌ను దాటుకుని విమానంలోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు.

ఇప్పటికే హైదరాబాద్ - లండన్ మధ్య..

ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్స్ ఒప్పందం కింద బ్రిటిష్ ఎయిర్ వేస్ లాంటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్, లండన్‌ల మధ్య రెగ్యులర్ సర్వీసులను పున:ప్రారంభించాయి.

కాంటాక్ట్ లెస్ విధానం..

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అతి తక్కువ ప్రయాణ సమయంతో, అత్యంత జాగ్రత్తల మధ్య జరిగే విమాన ప్రయాణాలే అత్యంత సురక్షితమైనవిగా తేలిందని అధికారులు వివరించారు. మే 25న విమాన సర్వీసులు పున: ప్రారంభమైన నాటి నుంచి జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కోసం డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్​తో కాంటాక్ట్ లెస్ విధానాన్ని ప్రయాణికులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : బోయలకు ఎస్టీ హోదా కల్పించాలి: బోయ హక్కుల పోరాట సమితి

ABOUT THE AUTHOR

...view details