తెలంగాణ

telangana

ETV Bharat / state

'మూడిల్​ ఎడ్​ టెక్​ ఫ్లాట్​ఫాం భారతదేశ డిజిటల్​ విద్యను మారుస్తుంది' - ఈ అభ్యాస్​ ఆన్​లైన్​ లెర్నింగ్​ యాప్​

Moodle Ed Tech Platform that bought this E ABYAS: దిగ్గజ లెర్నింగ్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ మూడిల్​ సంస్థ.. హైదరాబాద్​కు చెందిన ఈ లెర్నింగ్​ సంస్థ ఈ-అభ్యాస్​ను కొనుగోలు చేయడంపట్ల మంత్రి కేటీఆర్​ అభినందనలు తెలిపారు. మూడిల్‌ సంస్థ ఉత్పత్తి అభివృద్ధికి.. అంతర్జాతీయ సేవలకు మద్దతునిచ్చేందుకు తదుపరి 2 ఏళ్లలో భారతీయ విభాగాన్ని 400 మంది సభ్యులతో కూడిన బృందంగా పెంచేందుకు కృషి చూస్తోందని సంస్థ తెలిపింది.

Moodle  Ed Tech Platform that bought this E ABYAS
మూడిల్​ లెర్నింగ్​ టెక్​ ప్లాట్​ఫాం

By

Published : Dec 3, 2022, 10:19 PM IST

Moodle Ed Tech Platform that bought this E ABYAS: మూడిల్​ వంటి ఓపెన్​ ఎడ్​ టెక్​ ఫ్లాట్​ఫాం భారతదేశ డిజిటల్​ విద్యను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. దిగ్గజ లెర్నింగ్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​ మూడిల్​ సంస్థ.. హైదరాబాద్​కు చెందిన ఈ లెర్నింగ్​ సంస్థ ఈ-అభ్యాస్​ను కొనుగోలు చేయడంపట్ల మంత్రి కేటీఆర్​ అభినందనలు తెలిపారు.

మూడిల్‌ సంస్థ ఉత్పత్తి అభివృద్ధికి.. అంతర్జాతీయ సేవలకు మద్దతునిచ్చేందుకు తదుపరి 2 ఏళ్లలో భారతీయ విభాగాన్ని 400 మంది సభ్యులతో కూడిన బృందంగా పెంచేందుకు కృషి చూస్తోందని సంస్థ తెలిపింది. విద్యారంగంలో గొప్ప చరిత్ర కలిగిన మూడిల్‌కు భారత్​​ ఒక ప్రత్యేకమైన దేశమని సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, వ్యవస్థాపకులు మార్టిన్ డౌగియామాస్ పేర్కొన్నారు. భారతదేశంలోని అనేక సంస్థలు ఇప్పటికే మూడిల్ కమ్యూనిటీలో భాగంగా ఉన్నాయని.. ఇంకా చాలా మంది ఆన్‌లైన్ లెర్నింగ్ సౌలభ్యాన్ని తమ ఆచరణలోకి ఎలా తీసుకురావాలా అని అన్వేషిస్తున్నారని అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఈ-అభ్యాస్​ సంస్థతో కలిసి భారతదేశంలోని అధ్యాపకులకు మెరుగైన సేవలందించేందుకు ఎదురుచూస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓపెన్-సోర్స్ మూడిల్ సాంకేతికతను మెరుగుపరచడానికి మరింత కలిసికట్టుగా పనిచేయడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నామని మూడిల్‌ సంస్థ వ్యవస్థాపకులు మార్టిన్ డౌగియామాస్ అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details