గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో భాగంగా తార్నాకలో ఓటు హక్కును ఎమ్మెల్సీ రాంచందర్రావు వినియోగించుకున్నారు. సెలవు దినంగా భావించకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్రావు - ఎమ్మెల్సీ రాంచందర్రావు తాజా వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్లో భాగంగా హైదరాబాద్ తార్నాకలో ఎమ్మెల్సీ రాంచందర్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
![ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్రావు MLC Ramchander Rao exercised his right to vote In Tarnaka, Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9721676-573-9721676-1606794697358.jpg)
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్రావు
ఓటు వేసినప్పుడే మాత్రమే ప్రశ్నించే అధికారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యావంతులు ముందుకు వచ్చి.. ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ రాంచందర్రావు అన్నారు.
ఇదీ చూడండి :ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు