కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశానుసారం కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్సీ రామచంద్రా రావు 500 లీటర్ల పండ్ల రసాలను అందజేశారు. అలాగే పోలీసులకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి 10 వేల యూనిట్ల పండ్ల రసాలను ఇదివరకే పంపిణీ చేసినట్లు వివరించారు.
ఫీవర్ ఆస్పత్రి సిబ్బందికి పండ్ల రసాల పంపిణీ
హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్సీ రామచంద్రా రావు 500 లీటర్ల పండ్ల రసాలను అందజేశారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని సూచించారు.
ఫీవర్ ఆస్పత్రి సిబ్బందికి పండ్ల రసాల పంపిణీ
అంతేకాకుండా భాజపా నగర శాఖ ఆధ్వర్యంలో రోజూ 50 వేల మందికి నిత్యావసర సరుకుల పంపిణీ, 25 వేల మందికి భోజన వసతి కల్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతమ్ రావు, అజయ్, శ్యామ్ రావులు పాల్గొన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకూడదని తెలిపారు.
ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్