తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్చి22న పోలింగ్​..

శాసన మండలి ఎన్నికలకు రేపు నోటిఫికేషన్​ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

By

Published : Feb 24, 2019, 11:19 PM IST

రేపు ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్​

మార్చి22న పోలింగ్​..

ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్, ఆదిలాబాద్‌ పట్టభద్రుల, కరీంగర్‌-మెదక్‌-నిజామాబాద్-ఆదిలాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది.
మార్చి 5వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న పరిశీలన, 8న ఉపసంహరణకు గుడువు నిర్ణయించారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరుగనుంది. 26న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగే జిల్లాలో నియమావళి అమల్లోకి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details