మార్చి22న పోలింగ్..
శాసన మండలి ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, కరీంగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు రేపు నోటిఫికేషన్ వెలువడనుంది.
మార్చి 5వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న పరిశీలన, 8న ఉపసంహరణకు గుడువు నిర్ణయించారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 26న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగే జిల్లాలో నియమావళి అమల్లోకి వచ్చింది.