తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2022, 5:19 PM IST

Updated : Dec 21, 2022, 6:26 PM IST

ETV Bharat / state

ప్రగతిభవన్​కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. సీఎంతో భేటీ..

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

17:03 December 21

ప్రగతిభవన్​కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత.. సీఎంతో భేటీ..

ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్​కు వెళ్లారు. హైదరాబాద్​లోని తన నివాసం నుంచి నేరుగా ప్రగతిభవన్​కు వెళ్లిన కవిత.. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్​తో భేటీ అయ్యారు. దిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్​లో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్​తో కవిత భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో గతంలో నోటీసులు అందుకున్న సమయంలోనూ కవిత సీఎం కేసీఆర్​తో భేటీ అయిన విషయం విదితమే.

అయితే ఈడీ, సీబీఐ కేసులు డైలీ సీరియల్ లాంటివని తన నివాసం నుంచి ప్రగతిభవన్​కు బయల్దేరిన సమయంలో కవిత వ్యాఖ్యానించారు. రేపు నిజామాబాద్​లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న కవిత.. తాజా పరిణామాలపై అక్కడే స్పందిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి..

నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. కవితకు రాజన్న కౌంటర్

తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనే: చంద్రబాబు

Last Updated : Dec 21, 2022, 6:26 PM IST

ABOUT THE AUTHOR

...view details