తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 7:21 PM IST

ETV Bharat / state

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరకుల పంపిణీ

మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్​లోని గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం నిరుపేద ప్రజలకు నిత్యావసర సరకులను అందజేశారు.

mlc distributed daily commodities
మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరుకల పంపిణీ

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్ మాజీ కౌన్సిలర్ కందికంటి ప్రేమ్ నాథ్ గౌడ్ నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అందరూ కలిసి కేక్ కట్ చేశారు.

తన డివిజన్ పరిధిలో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలకు తమ వంతు సాయం చేశామని ప్రేమ్​నాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు ఆంజనేయులు, భిక్షపతి, ప్రమోద్ బాయ్, కృష్ణ, పండరినాథ్, విక్కీ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details