తెలంగాణ

telangana

నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్​

రాష్ట్రంలో లాక్​డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ... ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.

By

Published : May 17, 2020, 5:27 PM IST

Published : May 17, 2020, 5:27 PM IST

Hyderabad latest news
Hyderabad latest news

హైదరాబాద్​ గోషామహల్ నియోజకవర్గంలోని నేతాజీ బస్తీలో పేదలకు భాజపా నాయకుడు ఓం ప్రకాశ్​ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్​ బస్తీ వాసులకు నిత్యావసర సరకులను అందజేశారు.

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజాసింగ్​ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీర్చాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును... ప్రతి ఒక్క భాజపా కార్యకర్త పాటిస్తున్నారని తెలిపారు. లాక్​డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రతి బస్తీలో పేదల ఆకలి తీర్చేందుకు కృషి చేయాలని పార్టీ నేతలను కోరారు.

ABOUT THE AUTHOR

...view details