తెలంగాణ

telangana

By

Published : May 21, 2020, 8:28 PM IST

ETV Bharat / state

బస్తీ దవాఖానాను సందర్శించిన ఎమ్మెల్యే

ముషీరాబాద్​ నియోజకవర్గం దామోదర సంజీవయ్యనగర్​లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను శాసనసభ్యులు ముఠా గోపాల్​ సందర్శించారు. ప్రజలు ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.

mla visit government hospital
mla visit government hospital

బస్తీ దవాఖానాల్లో రోగులకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ సహకారం అందించాలని తెలిపారు. హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్ పూర్​లోని దామోదర సంజీవయ్య నగర్​లో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను శాసనసభ్యులు ముఠా గోపాల్ సందర్శించారు.

ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్​కు ఆస్పత్రి సిబ్బంది బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. ప్రజలందరూ బస్తీ దవాఖానా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రోగుల పట్ల సిబ్బంది సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'కరోనా లక్షణాలపై ఐసీఎంఆర్​ అధ్యయనం'

ABOUT THE AUTHOR

...view details