గణతంత్ర ఫలాలు భావి తరాలకు అందించడానికి యువత నడుం బిగించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
'గణతంత్ర ఫలాలు భావి తరాలకు అందించండి' - ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటిస్తూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
!['గణతంత్ర ఫలాలు భావి తరాలకు అందించండి' mla muta gopal participated in republic day celebrations in musheerabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10386478-784-10386478-1611649257551.jpg)
'గణతంత్ర ఫలాలు భావి తరాలకు అందించండి'
అనంతరం ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని గాంధీనగర్, కవాడిగూడ, రాంనగర్, అడిక్మెట్, భోలక్పూర్ డివిజన్లలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెరాస యువ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'గణతంత్రం'పై కోహ్లీ స్ఫూర్తిదాయక ట్వీట్