తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాలుష్యాన్ని అరికట్టటానికి మొక్కలు నాటడమే శ్రీరామరక్ష' - హరితహారంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ముఠాగోపాల్​

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ మొక్కలు నాటారు. అలాగే బాపూజీ నగర్​లోని కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

mla muta gopal participated haritha haram program at musheerabad in hyderabad
'కాలుష్యాన్ని అరికట్టటానికి మొక్కలు నాటడమే శ్రీరామరక్ష'

By

Published : Jul 26, 2020, 8:26 PM IST

సమాజాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దడానికి ప్రజలు స్వచ్ఛందంగా కృషి చేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్​ కవాడిగూడ డివిజన్లోని రోటరీ కాలనీలో కార్పొరేటర్ లాస్యనందితతో కలిసి ఆయన మొక్కలు నాటారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టటానికి మొక్కలు నాటడమే శ్రీరామరక్ష అని ఆయన వివరించారు.

అలాగే ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్​లో అరుణ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడటానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details