ముస్లిం సోదరులు కరోనా నియమాలను పాటిస్తూ రంజాన్ వేడుకలను జరుపుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విజ్ఞప్తి చేశారు. పండుగను పురస్కరించుకుని.. ముషీరాబాద్ నియోజకవర్గం అడికిమెట్లోని ఓ మసీదు వద్ద.. ప్రభుత్వం తరఫున పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - రంజాన్ వేడుకలు
ముషీరాబాద్ నియోజకవర్గం అడికిమెట్లో రంజాన్ను పురస్కరించుకుని.. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు.

Ramadan cloths distribution
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న మహమ్మారి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలా: హైకోర్టు